పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 21 మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్గా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న దీపికా మొదటిసారి ప్రభాస్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కాగా ఈ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆమెను తీసుకోవడానికి కారణం కథలోని దీపికా పాత్ర అని తెలిసింది. ఈ మూవీలో ఈ బ్యూటీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ రోల్ చేస్తుందట. పాత్ర దృష్ట్యా అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుందట. అందుకే ఏరికోరి దీపికను ఎంచుకున్నారని సమాచారం. ఇక ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం ‘రాజు పక్కన సరిజోడైన రాణి ఉండాలిగా,,, ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది’ అని అన్నారు. దీంతో దీపికాకు కథలో కీలకమైన పాత్ర ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. సీనియర్ ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రొఫెషనల్ డ్యాన్సర్గా దీపికా
- Advertisement -
- Advertisement -
- Advertisement -