Saturday, May 4, 2024

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పునీత్ అంత్య‌క్రియ‌లు పూర్తి..

- Advertisement -
- Advertisement -

Puneeth Rajkumar last rites completed

బెంగళూరు: ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య‌క్రియ‌లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్‌ సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు జరిపారు. తల్లిదండ్రులు రాజ్‌కుమార్‌, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్‌ అంత్యక్రియలు చేశారు. పునీత్‌ అంత్యక్రియల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మై, పలువురు సినీ, రాజీకయ ప్రముఖులు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని కడసారిగా చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కాగా, శుక్రవారం ఉదయం తన నివాసంలోని జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్‌ రాజ్‌కుమార్‌కు కన్నుమూశారు.దీంతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Puneeth Rajkumar last rites completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News