Thursday, May 9, 2024

ప్రతి ఒక్కరం జాతికి పునరంకితమవుదాం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada wishes independence day

ఖమ్మం: 75వ స్వాతంత్ర్య వేడుకల్ని ఆనందోత్సాహాలతో జాతికి పునరంకితమవుతూ చేసుకుందామని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, భారతీయులందరికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ప్రతీ మహానీయున్నీ స్మరించుకుని ఘన నివాళులు అర్పిస్తున్నామని, ఈ స్వాతంత్ర్య దినోత్సవ పర్వదిన వేళ ప్రతి ఒక్కరం జాతికి పునరంకితమవుదామని, మన దేశాన్ని ముందుకు తీసుకవెళ్ళడానికి సంకల్పం తీసుకోవాలన్నారు.

అహింసా మార్గంలో చేసిన దేశ స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ పోరాటాన్ని అహింసా మార్గంలో నడిపి విజయం సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణను దేశంలోనే మేటిగా తయారు చేస్తున్నామని పువ్వాడ పేర్కొన్నారు. ఈ స్వతంత్ర స్ఫూర్తిని సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో భవిష్యత్ లోను కొనసాగిస్తా ప్రజలందరికీ మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News