- Advertisement -
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాలపై చర్చించామని టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎంపి కెకె ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కెకె మీడియాతో మాట్లాడారు. పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్ , శ్రీనివాస్గౌడ్, పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
- Advertisement -