రంగారెడ్డి: ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలోని సర్కిల్ 5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ జరిగింది. శ్రీధర్ పది రోజుల నుండి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు తెలియజేశారు. రెండు రోజుల క్రితం శ్రీధర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఉన్నత స్థాయి అధికారులు కలగజేసుకుని కరోనా టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీధర్ తో పనిచేసే సిబ్బంది, మహిళా కంప్యూటర్ ఆపరేటర్, చైన్ మెన్లు, ఎసిపి రాణి తో సహా ఉన్నత అధికారులు భయాందోళనకు గురయ్యారు. జిహెచ్ఎంసి ఎల్బీనగర్ కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్లు సమస్యలపై స్పందించే జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, పారిశుధ్యం మౌలిక వసతుల కల్పన పనిగా విధులు నిర్వహించే వారికే కరోనా రావడం భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు సంబంధిత సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.