- Advertisement -
వయనాడ్ (కేరళ): కేరళ వయనాడ్ జిల్లా కాల్పెట్టాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం జరిగిన ర్యాలీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. రాజ్యాంగాన్ని రక్షించు అన్న నినాదంతో ఈ ర్యాలీ సాగింది. రెండు కిలోమీటర్ల పొడవున సాగే ఈ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పతాకాలను ధరించి నినాదాలు చేశారు. వయనాడ్ లోని ఎస్కెఎంజె హైస్కూలు నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల, కెపిసిసి అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్, ఎఐసిసి కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
Rahul Gandhi leads Save the Constitution march in kerala
- Advertisement -