Tuesday, April 30, 2024

మేధావులు, విద్యావంతులతో రాహుల్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మేధావులు, విద్యావంతులతో రాహుల్‌గాంధీ ఆదివారం భేటీ అయ్యారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం తదితరాలపై ఆయనకు పలు సూచనలు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ఆకాంక్షలను గుర్తించి యువతకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న అంశాన్ని నొక్కి చెప్పడంతో పాటు దానికి తగిన శిక్షణ అవసరాలపై దృష్టి పెట్టాలని కోరారు. రాహు ల్‌తో భేటీ అయిన వారంతా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు కావడంతో వాటికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానం, అందులోని లోపాలను వెల్లడించారు. పేదలకు అందాల్సిన వైద్య సౌకర్యాలు, వైఎస్సార్ హయాంలో అమలైన పథకాలు, సామాజిక న్యాయం ప్రస్తుతం నిర్వీర్యం కావడం తదితరాలపై కూడా రాహుల్ చర్చించారు.

ఒబిసిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ విధానమని వారికి నొక్కిచెప్పినట్లు సమాచారం. బ్యూరోక్రసీలో మాత్రమే కాక ఉన్నత విద్యా సంస్థల్లో సైతం వారికి అవకాశాలు దక్కలేదన్న అంశాన్ని కొన్ని ఉదాహరణలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వెల్లడించారు. ఇకపైన ఉన్నత విద్యా సంస్థల్లో ఎలాంటి అవకాశాలు ఉండాలో, ఉన్నత స్థానాల్లో అధికారులకు తగిన ప్రయారిటీ ఇచ్చి ఆ సెక్షన్ ప్రజలకు అందించాల్సిన సామాజిక న్యాయం, కల్పించాల్సిన ఆవశ్యకత గురిం చి వివరించినట్లు సమాచారం. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న ఒబిసిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుం టున్న అంశాల గురించి రాహుల్ వారికి ప్రాథమికంగా వివరించినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, శాంతసిన్హా, వెంకట నారాయణ, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాధ్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ సోహ్రాబేగం, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, కే.శ్రీనివాస్, జర్నలిస్టు విఠల్, మోహన్ గురుస్వామి, సందేశ్ సింగల్కర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే, ఎఐసిసి నుంచి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News