Monday, April 29, 2024

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల నియామకం రద్దు

- Advertisement -
- Advertisement -

కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేస్తూ జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఎంఎల్‌సిల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని సూచన

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ సిఫారసుపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన న్యాయస్థానం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కోదండరాం, అమీ ర్ అలీఖాన్‌ల నియామకాలపై ప్రభుత్వం ఇ చ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్ తీ సుకున్న నిర్ణ యంపై అభ్యంతరం తెలిపింది. ఎంఎల్‌సిల నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చే సింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పం పించాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిలుగా నియమించడంపై బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ తమిళిసై సౌం దర రాజన్ అంగీకరించారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. అయితే అంతకుముందు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా సి ఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పం పింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్ల ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళిసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎంఎల్‌సిలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు వెల్లడించారు. బిఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్ కోటాలో ఎంఎల్‌సిలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ లను ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ వద్దకు పంపింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సును అనుసరించి వారి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అయితే దీన్ని సవాల్ చేస్తూ కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో వెల్లడించారు. దీనిపై పిటిషనర్లు, ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం తరఫున న్యాయవా దులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువ రించింది. దీంతో శ్రవణ్, సత్యనారాయణలకు కొంత ఊరట లభించింది. అయితే ఈ పరిణామం తరువాత కాంగ్రెస్ ఎలాంటి అడుగులు వేస్తుం దనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News