న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్-శాలిమార్, లింగంపల్లి-కాకినాడ టౌన్, విశాఖ-తిరుపతి, సికింద్రబాద్- విశాఖ రైళ్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరలో ఈ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆయా రైల్వే జోన్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు రైల్వేశాఖ ఈ రైళ్లు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే త్వరలోనే ఆయా రైళ్లు ప్రారంభమైయ్యే తేదీ, టికెట్ల బుకింగ్ అందుబాటులోకి వచ్చే తేదీని రైల్వేశాఖ ప్రకటించనుంది.
Railway Board today gave approval to zones for 39 new trains. These services will be introduced as special services from an early convenient date: Ministry of Railways, Government of India pic.twitter.com/UloAYzxZBS
— ANI (@ANI) October 7, 2020
Railway Board approval to zones for 39 new trains