Monday, May 6, 2024

ఎపిలో కొత్తగా 5వేల కేసులు.. 6వేలు దాటిన మరణాలు

- Advertisement -
- Advertisement -

5120 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 66,769మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 5,120 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 34మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 7,34,427కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 6,086మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 49,513మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,084మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 6,788,828మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 62,834,0096మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

5120 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News