- Advertisement -
సంగారెడ్డి: పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు రాములు (పెద్దకంజర్ల), కుమార్ (జిన్నారం)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రెండు వాహనాలు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Two killed in road accident at Patancheru
- Advertisement -