Sunday, April 28, 2024

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ‘షూట్ ఎట్ ఆలేరు’..

- Advertisement -
- Advertisement -

Ram Charan Unveils 'Shootout at Alair' Showreel

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మాతలుగా రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘షూట్ ఎట్ ఆలేరు’. ఈ వెబ్ సిరీస్ ఈనెల 25న జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ సిరీస్ షోరీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ “షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ షోరీల్ అద్భుతంగా ఉంది. చాలా రియల్‌గా కూడా ఉంది. నటన విషయంలో, రియలిస్టిక్ లుక్ విషయంలో నటీనటులు అందరూ బెస్ట్ ఇచ్చారు. మా అక్క సుష్మిత, భావ విష్ణుప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు.

సుష్మితా కొణిదెల మాట్లాడుతూ.. “ఆనంద్ మంచి డైరెక్టర్. ఆనంద్, అతని టీమ్ వల్ల ఈ ప్రాజెక్ట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ మా మొదటి ప్రాజెక్ట్‌లో ఉండడంతో ఆనందంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ రంగా, ప్రసాద్ నిమ్మకాయల, విష్ణు ప్రసాద్, నందినీ రెడ్డి, నటీనటులు నందినీ రాయ్, తేజ, సందీప్ సాహు తదితరులు పాల్గొన్నారు.

Ram Charan Unveils ‘Shootout at Alair’ Showreel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News