Saturday, May 4, 2024

సివిల్స్ అభ్యర్థులతో ఆర్‌జివి ముఖాముఖి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులతో ముచ్చటించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాం గోపాల్ వర్మ ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ క్రిష్ణప్రదీప్ అడిగిన ప్రశ్నలకు ఆర్‌జివి సమాధానం చెప్పారు.

విద్యా విధానంలో నిరంతరం మార్పు రావాలని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యూ జనరేషన్ రైట్స్, హోమో సెక్సువల్ హక్కులు, సేమ్ సెక్స్ మ్యారేజ్, ఎల్‌జిబిపిపై సుప్రీంకోర్టు తీర్పులు, ప్రస్తుత విద్యా విధానం, కుటుంబ వ్యవస్థ, మహిళల పట్ల సమాజం తీరు తదితర అంశాలపై అభ్యర్థులకు అడిగిన ప్రశ్నలకు రాం గోపాల్ వర్మ సమాధానాలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News