Friday, April 26, 2024

400 గిరిజన కుటుంబాలకు సాయం

- Advertisement -
- Advertisement -

Rana Assistance to 400 tribal families

 

కోవిడ్ -19 సెకండ్‌వేవ్ కారణంగా పేద ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ మహమ్మారి సమయంలో ఇబ్బందులకు గురవుతున్న నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు తనవంతు సహాయం చేశారు రానా. గ్రామాల మొత్తం సమూహంలోని ప్రజలకు అవసరమైన కిరాణా సామాగ్రి, మందులు అందించారు.అల్లంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతి, గుర్రం మధిర, పాల రేగ్డి, అద్దాల తిమ్మపూర్, మిసాల భూమన్న గూడెం, గగన్నపేట, కనిరాం తాండా, చింతగూడెం, గోంగూరం గూడ్, కడెం మండలాలతో కూడిన కుగ్రామాలకు రానా ఈ సాయం అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News