- Advertisement -
యంగ్ హీరో నితిన్, ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్కు మంచి స్పందన వచ్చింది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ఇటీవల పునః ప్రారంభమై చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ‘ఏమిటో ఇది’ అనే లిరికల్ సాంగ్ను ఈనెల 5న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -