Saturday, May 4, 2024

నెల రోజుల పాలన తృప్తినిచ్చింది: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా నెలరోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ‘సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవితవైపునకు అడుగులు వేస్తోంది.

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామికాభివృద్దికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వరిస్తా’ అంటూ సిఎం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News