Monday, May 6, 2024

మర్రి జనార్థన్ రెడ్డిపై మండిపడిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ మర్రి జనార్థన్ రెడ్డి పాదయాత్రపై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. బోనం బతుకమ్మతో వస్తే డబ్బులిస్తామని చాటింపు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవమని, బోనం ఎత్తడం తెలంగాణ సంస్కృతికి సంకేతమని పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి వెలకట్టడం బిఆర్‌ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ అని రేవంత్ మండిపడ్డారు. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం అని, బిఆర్‌ఎస్ పతనానికి సంకేతం అని ధ్వజమెత్తారు.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News