- Advertisement -
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమనేడులో దొంగలు ఎటిఎంను దోచుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగ గురువారం వెలుగులోకి వచ్చింది. ఎటిఎం చోరీకి గురయ్యిందని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులు గ్యాస్ కట్టర్తో ఇండిక్యాష్ ఎటిఎంను ధ్వంసం చేసి ఎటిఎంలోని నగదును అపహరించుకుపోయారని గుర్తించారు. బ్యాంకు అధికారుల వివరాలననుసరించి దర్యాప్తు చేపట్టారు.
Robbers who destroyed ATM and cash looted
- Advertisement -