Tuesday, April 30, 2024

ఆదిలోనే టీమిండియాకు షాక్.. రోహిత్, గిల్ ఔట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(29)ల వికెట్లను కోల్పోయి భారత్ ఒత్తిడిలో పడింది. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రర్ అర్చర్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా రోహిత్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ శుభమన్ గిల్ దూకుడుగా ఆడే క్రమంలో అర్చర్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు.  ఓపెనర్లను ఇద్దరినీ ఔట్ చేసి అర్చర్ భారత్ కు షాకిచ్చాడు. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో ఛటేశ్వర పుజారా(14), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2)లు ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Rohit Sharma dismissed by Jofra Archer on day 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News