Saturday, April 27, 2024

మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్‌ ఇంట్లో విషాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులతోపాటు సెలబ్రెటీ కుంటుంబాలల్లోనూ తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా, టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ ఇంట్లోనూ కరోనా విషాదం నింపింది. ఇటీవల కరోనా బారిన పడిన ఆర్పీ సింగ్‌ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆర్పీ సింగ్‌ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘నా తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ ఇకలేరనే విచారకరమైన విషయాన్ని తీవ్ర దు:ఖంతో తెలియజేస్తున్నా. ఆయన కొవిడ్‌తో పోరాడుతూ ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా’ అని ట్వీట్‌ చేశాడు.

కాగా, ఆర్పీ సింగ్‌ టీమిండియా తరఫున 14 టెస్టు మ్యాచ్‌లు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో ఆర్పీ కూడా ఉన్నాడు.

RP Singh’s Father passed away due to Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News