Friday, May 10, 2024

పెళ్లి వద్దన్నందుకు ప్రియుడితో కలిసి తల్లిని చంపి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడితో కలిసి తల్లిని కూతురు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రూపశ్రీ అనే యువతి వరుణ్ సాయిని ప్రేమించింది. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తన తల్లితో ప్రియుడిని చేసుకుంటానని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తల్లిని చంపాలని ఆమె నిర్ణయం తీసుకుంది. తల్లి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు సాయంతో ముఖంపై దిండు అదిమిపెట్టారు. చనిపోయిందనుకొని ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కూతురు ఏమీ తెలియనట్టుగా తండ్రికి ఫోన్ చేసి తల్లి కిందపడిపోయి చనిపోయిందంటూ తెలియజేసింది. వెంటనే తండ్రి ఆర్‌ఎంపి వైద్యుడుకు సమాచారం ఇచ్చాడు. ఆమె బతికే ఉందని చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యంలో ఆమె ప్రాణం పోయింది. పోస్టుమార్టమ్ చేసిన వైద్యులు ఆమెది సహజ మరణం కాదని, హత్య చేశారని తెలిపారు. వెంటనే కూతురును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి హత్య చేశానని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News