Wednesday, May 15, 2024

ఎస్విబిసి ట్ర‌స్టుకు రూ. 4.20 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Rs 4.20 crore donation to SVBC Trust

 

తిరుమల: అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్విబిసి ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఇఒ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. రవి ఐకా ఇప్పటికే టిటిడికి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News