Saturday, April 27, 2024

రైతులకు గుడ్ న్యూస్.. వారికి కూడా రైతుబంధు అవకాశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో కొత్త రైతులకు కూడా రైతుబంధు పథకం కింద సాయం పొందే అవకాశం కల్పించింది. ఈనెల 20నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది,ధరణిలో నమోదు అయిన వారు ,అన్ని అర్హతలు, తగిన ధృవ పత్రాలు ఉండి ఇప్పటివరకూ రైతుబంధు సాయం పొందలేకపోయిన వారు ఉంటే యాసంగి రైతుబంధు పథకం కింద సాయం పొందేందుకు ధరఖాస్తు చేసుకోవచ్చిని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

గ్రామాల్లో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి రైతుబంధు పథకానికి ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అయితే ఇప్పటికే గత వానాకాలంలో ఏఈఓలకు ధరఖాస్తులు అందజేసిన వారు మళ్లీ కొత్తగా ధరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రైతుబంధు పధకం కోసం ధరఖాస్తుతోపాటు భూమికి చెందిన పట్టాదారు పాస్ బుక్కు ప్రతి, మండల రెవెన్యూఅధికారి డిజిటల్ సంతకం అయిన డిఎస్ పత్రాలు, ఆధార్ జిరాక్సు ప్రతి, బ్యాంకు పాస్‌బుక్కు జిరాక్సు ప్రతి జతచేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News