Saturday, May 4, 2024

రైతుబంధు, రుణమాఫీ నిధుల విడుదలకు నో

- Advertisement -
- Advertisement -

తిరస్కరించిన ఎన్నికల కమిషన్

ఉద్యోగుల డిఎ విడుదలకు నిరాకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డిఎలు, రైతు రుణమాఫీల జారీకి అనుమతి ఇవ్వాలంటూ కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. అయితే అధికార పార్టీ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డిఎలు ఇప్పుడు ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సం ఘం ప్రశ్నించింది. అలాగే రైతుబంధు ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇసిని ఆశ్రయించిందని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పందిస్తూ రైతుబంధు ఆపాలంటూ తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News