Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ విసిరిన చాలెంజ్ స్వీకరించి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఆవరణలోని అఫ్జల్ పార్క్ లో సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ సజ్జన్ సింగ్ మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపి సంతోష్ కుమార్ కి సజ్జన్ సింగ్ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లేందుకు ఎస్ జిపిసి అమృత్ సర్ మాజీ కార్యదర్శి సర్దార్ రూప్ సింగ్, అమృత్ సర్ ఖల్సా కాలేజ్ ఫైనాన్స్ సెక్రెటరీ గున్బీర్ సింగ్, సింగ్ సాహిబ్ జ్యోతిందర్ సింగ్, సుచంద్ హజూర్ సాహిబ్ హెడ్ గ్రంధి, సింగ్ సాహిబ్ అవతార్ సింగ్ శీతల్, మాజీ పాంగ్‌ప్యారా నాందేడ్ లకు సజ్జన్ సింగ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News