Friday, May 3, 2024

సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా

- Advertisement -
- Advertisement -

Samantha defamation case verdict adjourned

హైదరాబాద్: ప్రముఖ నటి సమంత వైవాహిక జీవితానికి సంబంధించి స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంపై సమంత కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసులో వాదనలు ముగియడంతో తీర్పుని కోర్టు వాయిదా వేసింది.కాగా ఈ కేసు వాదనల సందర్భంగా యూట్యూబ్ ఛానెళ్ళపై పరువు నష్టం కేసుకి బదులుగా వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు భవిష్యత్తులో తనకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయకుండా ఇంజెంక్షన్ ఆర్డర్ జారీచేయాలని సమంత తరఫు న్యాయవాది కూకట్ పల్లి కోర్టుని కోరారు. వాదనలు విన్న కోర్టు తుది తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని మీడియా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News