ముంబై: శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ తనను బెదిరించాడని బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ విమర్శించారు. తనను ముంబైకి తిరిగి రావద్దంటూ ఆయన ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడని ట్వీట్ చేసింది. ముంబయి వీధుల్లోని గోడలపై ఇప్పటివరకు ఆజాదీ రాతలను చూశామని, ఇప్పుడు బహిరంగ బెదిరింపులను చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదిరిగా కనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ముంబై పోలీసులకు భయపడితే మళ్లీ వెనక్కి రావద్దంటూ కంగనను ఉద్దేశించి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మేరకు కంగన పైవిధంగా స్పందించింది. సుశాంత్ సింగ్ బలవన్మరణం అనంతరం కంగన బాలీవుడ్ పై తీవ్రవిమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న నెపోటిజం, డ్రగ్స్ కల్చర్ పై ఆమె బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. సిఎం ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరేపై కూడా కంగన ఆరోపణలు గుప్పించింది. ఆదిత్యను ‘బేబీ పెంగ్విన్’ అని కంగనా రనౌత్ పేర్కొంది.
Sanjay Raut has given me an open threat says kangana
https://twitter.com/KanganaTeam/status/1301413968729210880