- Advertisement -
హైదరాబాద్: బిఆర్ కె భవన్ లో ఉన్నతాధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సోమేష్ కుమార్ ఆదేశించారు. శాసన సభ, మండలిలో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శలకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల సందర్భంగా లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్ను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు.
- Advertisement -