Sunday, April 28, 2024

రేవంత్ ను కలిసిన సంజయ్, గండ్ర, ఎర్ర శేఖర్

- Advertisement -
- Advertisement -

Sanjay Shekhar gandra meet with revanth reddy

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మాజీ మేయర్ నిజామాబాద్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్,  భూపాలపల్లి సీనియర్ లీడర్ గండ్ర సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.  త్వరలో బహిరంగ సభలు పెట్టి పార్టీలో చేరుతామన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవి,  భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తెలిపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు.

పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌ రెడ్డికి ధర్మపురి సంజయ్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగా.. కొన్ని కారణాలతో పార్టీ మారానన్నారు. మా నాన్న కోసమే టిఆర్ఎస్ చేరానని వివరించారు. రేవంత్ నాయకత్వం బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు.  త్వరలో డిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News