హైదరాబాద్: సిఎం కెసిఆర్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను అన్ని పదవులతో గౌరవించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈటెల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు. స్వలాభం కోసం, పదవుల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి కాళ్ల దగ్గర పెట్టడం శోచనీయం కాదని మండిపడ్డారు. తమకు ప్రజలే హైకమాండ్ అని, వారికి అన్యాయం చేయడంతోనే ఈటెలను బర్త్ రఫ్ చేశారని, ఐదేళ్ల క్రితమే అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని సత్యవతి నిలదీశారు. ఆత్మాభిమానం పేరిట ప్రజలను అవమానించారని, ప్రగతి భవన్లో అట్టడుగు వర్గాలు లేదనడం సరికాదన్నారు. ముందు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలని నిలదీశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపికి తగిన బుద్ధి చెప్పారన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడు ఏళ్లలో జరిగిందని ప్రశంసించారు.
ప్రజలకు అన్యాయం చేయడంతోనే ఈటెల బర్త్ రఫ్: సత్యవతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -