Saturday, May 11, 2024

కుమారుడు, కోడలిపై మాజీ మంత్రి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Satyanarayana Raju's complaint against his son, Daughter-in-law

ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు

హైదరాబాద్ : తనకు కుమారుడు, కోడలి నుంచి ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి కంటేటి సత్యనారాయణ రాజు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాజీ మంత్రి సత్యనారాయణ రాజు నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి ఆస్తి విషయంపై కుమారుడు, కోడలితో సత్యనారాయణరాజుకు వివాదం నడుస్తోంది. సత్యనారాయణ రాజు తన తదనంతరం ఆస్తులు కుమారుడికి చెందేలా వీలునామా రాశారు. ఇప్పుడే ఆస్తులు కావాలని కుమారుడు, కోడలు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తన బెడ్ రూములోనిన అల్మరా తాళాలు పగులగొట్టి ఆస్తుల పత్రాలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. కోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News