Wednesday, May 1, 2024

బస్ భవన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ,సిటీబ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ 87వ జయంతి ఉత్సవాలు బస్‌భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (రెవెన్యూ,ఐటీ కార్యదర్శి ) ఎ. పురుషోత్త ఆయన చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జయశంకర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే తెలంగాణ ఉద్యమం గురించి పోరాడేవారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డిల్లీ నుంచి గల్లీ వరకు ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరిలోనూ ఉద్యమస్పూర్తిని నింపారన్నారు. జయశంకర్‌ను స్పూర్తిగా తీసుకుని ఆర్‌టిసిలోని ప్రతి ఉద్యోగి నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరక్టర్ గంగారెడ్డి, సి.పి.ఎం. సూర్యకిరణ్, సి.ఎం.ఇ రఘునాద్‌రావు, సిటిఎం జీవన్ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News