Tuesday, April 30, 2024

కరీంనగర్‌లో బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పదో తరగతి చదువుతున్న బాలిక వీడియోలతో బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికతో ఇంటర్ చదివే విద్యార్థి చనువుగా ఉన్నాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు పోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలో ప్రియుడి స్నేహితులు పలుమార్లు లొంగదీసుకున్నారు. మరో ముగ్గురు స్నేహితులు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News