Friday, May 3, 2024

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా..

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా పాజిటివ్
జ్వరంతో బాధపడుతున్న ఇసి పార్థసారథి
తొలి డోసు టీకా వేసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డ కమిషనర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కొవిడ్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధృవీకరించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 28న నిమ్స్‌లో ఆయన కొవిడ్ టీకా తొలిడోసు వేసుకున్నారు. తొలి డోసు వేసుకున్న తర్వాత ఆయన కరోనా బారిన పడ్డారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పార్థసారథి సూచించారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్‌ఇసి కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

SEC Parthasarathi test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News