Friday, May 3, 2024

టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్లు

- Advertisement -
- Advertisement -

Sehwag satires on Team India

 

న్యూఢిల్లీ: పింక్‌బాల్ టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో సహా నెటిజన్లు భారత జట్టు ఘోర పరాజయంపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు. భారత మాజీ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియా ఓటమిపై తనదైన శైలీలో స్పందించాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన స్కోర్లపై 4, 9, 2, 0, 4, 0, 8, 4, 0, 4*, 1 స్పందించిన సెహ్వాగ్ దీన్ని ఓ నంబర్‌గా వర్ణించాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ఓటిపిని అందరు మరచిపోతే మంచిదని హితవు పలికాడు. భారత బ్యాట్స్‌మెన్ చెత్త ఆటతో దేశ పరువు తీశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి, పుజారా, రహానె, విహారి తదితరులతో కూడిన భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ కావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News