- Advertisement -
న్యూఢిల్లీ : ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మొదటి అధికారిక నమూనా విజువల్స్ను జపాన్ దౌత్యకార్యాలయం విడుదల చేసింది. అధికారిక పరిభాషలో ఈ ప్రాజెక్టును ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అని పిలుస్తారు. జపాన్ ఇప్పుడు విడుదల చేసిన ఇఎస్ సీరీస్ ఆఫ్ షింకన్సేన్ కు సంబంధించిన ఈ నమూనా ఫోటోల మాదిరిగానే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రయిన్ తయారౌతుంది. 2023 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే మహారాష్ట్రలో భూసేకరణ ఇంకా కాలేనందున ఈ ప్రాజెక్టు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాదాపు 1.08 లక్ష కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకోసం సెప్టెంబర్ 24న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ బిడ్లు ఆహ్వానించింది. లార్సెన్ అండ్ టోబ్రోఈ కాంట్రాక్టు చేజిక్కించుకుంది.
- Advertisement -