Saturday, April 27, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of Gold at Shamshabad Airport

 

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం నాడు 700 గ్రాముల బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి ప్యాకెట్‌లో 700 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు. 34 లక్షల విలువ చేసే 24 క్యారెట్‌ల బంగారాన్ని గొలుసుల రూపంలో సదరు ప్రయాణికుడు తాను వేసుకున్న ప్యాంట్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జేబులో దాచి తరలించే యత్నం చేశాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో విదేశీ బంగారం బయట పడింది. బంగారం సీజ్ చేసి ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News