Wednesday, May 1, 2024

వరుస లాభాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

377 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్ల వరుస లాభాలను బ్రేక్ పడింది. మంగళవారం ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్‌లో క్షీణత కనిపించింది. బ్యాంకింగ్, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్‌లో మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా డౌన్ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 377 పాయింట్లు పతనమై 69,551 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 20,906 పాయింట్ల వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే మెటల్, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీల్లో పెరుగుదల కనిపించింది. బ్యాంకింగ్, ఐటి, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 12 షేర్లు లాభాలతో ముగియగా, 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 నిఫ్టీ స్టాక్స్‌లో 19 లాభాలతో, 31 నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌లో అమ్మకాల కారణంగా బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.350 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. మంగళవారం బిఎస్‌ఇ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.349.80 లక్షల కోట్లకు తగ్గగా, క్రితం సెషన్‌లో ఇది రూ.351.11 లక్షల కోట్లుగా ఉంది. అంటే మంగళవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.1.31 లక్షల కోట్లు క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News