Saturday, May 11, 2024

ఎస్‌పిలో చేరిన ఏడుగురు బిజెపి, బిఎస్‌పి ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

Seven BJP and BSP MLAs have joined the SP

 

లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక బిజెపి ఎమ్మెల్యే, బిఎస్‌పి నుంచి సస్పెన్షన్‌కు గురైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ రానున్న రోజుల్లో బిజెపిని రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని, బిజెపి పరివారం పరారీ పరివారంగా మారే రోజు దగ్గరలోనే ఉందని యాదవ్ విమర్శించారు. బిజెపికి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా తనను సంప్రదిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువౌతారని ఆయన ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News