Saturday, April 27, 2024

షా, ధావన్‌ మెరుపు‌ అర్ధశతకాలు

- Advertisement -
- Advertisement -

Shah, Dhawan half century completed

ముంబై: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై‌ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌ మెరుపు‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే షా కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతనికిది ఏడోది కావడం విశేషం. మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా కెరీర్‌లో 42వ హాఫ్‌సెంచరీ సాధించాడు. ఓపెనర్లిదర్దూ ఇప్పటికే 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 12 ఓవర్లకు ఢిల్లీ వికెట్‌ కోల్పోకుండా 121 పరుగులు చేసింది. ధావన్‌(62), షా(59) క్రీజులో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News