- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) నేపథ్యంలో రిలయెన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కప్టమర్లకోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లస్ కస్టమర్లకు ఐపిఎల్ లైవ్ స్ట్రీమింగ్ అందించేందుకు డిస్నీప్లస్ హాట్స్టార్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.399తో ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లు రూ.399తో ప్రారంభం కానున్నాయి. అలాగే నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లతోను హాట్స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది.
- Advertisement -