సిద్ధిపేట : తెలంగాణ బిజెపి నేత రఘునందన్రావుకు చేదు అనుభవం ఎదురైంది. సిద్ధిపేట జిల్లాలోని రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన ప్రసంగాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం గ్రామంలో మాట్లాడుతుండగా టిఆర్ఎస్ను విమర్శించే వ్యాఖ్య లు చేయడంతో గ్రామస్తులు ఆయన స్పీచ్ను అడ్డుకుని తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సమయంలోనే తమ గ్రామాలు గుర్తుకొస్తాయా? అంటూ స్థానికులు ప్రశ్నించారు. సంక్షేమం కోసం టిఆర్ఎస్ సర్కార్ అనేక పథ కాలు ప్రవేశపెట్టిందన్నారు. బిజెపి చేసిన ఘనత ఏమీ లేదని గ్రామస్తులు తేల్చి చెప్పడంతో సమాధానం చెప్పుకోలేక రఘునందన్రావు గ్రామం నుంచి వెళ్లిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుందని రఘునందన్రావు చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామం నుంచి వెళ్లిపోయారు.