ఒస్జెక్(క్రొయేషియా): ఇక్కడ జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు మిక్స్డ్ టీమ్ విభాగంలో రజతం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్, సౌరభ్ చౌదరి జోడీ రజత పతకం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో భారత జంట ఓటమి పాలైంది. రష్యాకు చెందిన విటాలినాఅర్టెన్ జోడీతో జరిగిన ఫైనల్లో భారత జోడీ 1612 తేడాతో పరాజయం చవిచూసింది. రష్యా జంట ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శనతో పైచేయి సాధించింది. ఇక ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన మనుబాకర్ జోడీ రజతంతో సంతృప్తి పడింది. ఒలింపిక్స్కు సన్నాహకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రపంచంలోని అగ్రశ్రేణి షూటర్లు పోటీ పడుతున్నారు. ఇక షూటింగ్ ప్రపంచకప్లో భారత్ మొత్తం మూడు పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు కాంస్యం దక్కింది. అంతేగాక పురుషుల వ్యక్తిగత విభాగంలో సౌరభ్ చౌదరి కాంస్యం గెలుచుకున్నాడు.