Monday, May 6, 2024

గాల్లో పేలిన విమానం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

సావోపాలో: గాల్లో విమానం పేలి ఏడుగురు మృతి చెందిన సంఘటన బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రంలో జరిగింది. ఒకే ఇంజన్ గల విమానం ఏడుగురు ప్రయాణికులతో వెళ్తుండగా ఇట్‌పేవా శివారులోని అటవీలో ప్రాంతంలో పేలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మూడు మృతదేహాలను గుర్తించామని విమానయాన అధికారులు వెల్లడించారు. ఐదు నెలల క్రితం బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్‌లో విమానంలో కూలిపోవడంతో 14 మంది దుర్మరణం చెందారు. డిసెంబర్ నెలలో ఇల్‌బెలా ఐలాండ్‌లో విమానంలో కూలిపోవడంతో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News