Saturday, May 4, 2024

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల:మిస్సింగ్ కేసులతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ గారు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జగిత్యాల రూరల్, ధర్మపురి సర్కిల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. గత నెలలో జరిగిన గ్రేవ్ , నాన్ గ్రేవ్, మహిళ సంబందిత నేరాలు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతూ ఏవరైన తప్పిపోయారు అని లేదా కనిపించుటలేదు అని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని అన్నారు.

జిల్లా లో మిస్సింగ్ అయన మహిళలు, చిన్న పిల్లలు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని ట్రేస్ చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా మిస్సయిన వారిని ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు. గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్‌ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్ కేసులను ఛేదించవచ్చని సూచించారు.

దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నేర నియంత్రణ చర్యలలో కీలక పాత్ర పోషించే సి సి కెమెరాల ఏర్పాటు లో ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగలపై అవగాహన కలిగిస్తూ ప్రజలను, వ్యాపారులను భగస్వామ్యులను చేయాలని, జిల్లాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కెమెరాలు పని చేయు స్థితిలో ఉన్నాయి. ఇంకా ఎన్ని ప్రదేశాల్లో అవసరం ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటస్వామి, శ్రీనివాస్ సిఐలు రమణమూర్తి ,ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్‌ఐలు, CRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News