Friday, May 3, 2024

దీపావళికి స్పెషల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

Special treat for Diwali from Pushpa

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప : ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్, మూడు సింగిల్స్ విడుదల కాగా.. వాటికి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో దీపావళికి మరో టీజర్‌తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈనెల 4న ‘పుష్ప : ది రైజ్’ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలిసింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News