Monday, April 29, 2024

మెండీస్ డకౌట్…. లంక 50/2

- Advertisement -
- Advertisement -

గౌహతి: బర్సాపార క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అవిషకా ఫెర్నాడో ఐదు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ పరుగులే చేయకుండా సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో 373 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లు ఇంకా 324 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(83), శుభమన్ గిల్(70) పరుగులు చేసి పర్వాలేదనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News