Monday, May 6, 2024

బిసి జాబితాలో మార్పులు చేర్పులపై జోక్యానికి సుప్రీం ‘నో’

- Advertisement -
- Advertisement -

Supreme no to interfere with changes in BC list

కేటగిరిలో మార్పులపై
అధ్యయనం చేయాలని
తెలుగు రాష్ట్రాల బిసి
కమిషన్లకు ఆదేశం

న్యూఢిల్లీ : బిసి ఉప కులాల జాబితా నుంచి కొన్ని కులాల తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బిసి ఉప కులాలపై మంగళవారం సుప్రీంలో విచారణ ముగిసింది. కేటగిరీ మార్పులపై పరిస్థితులకు అనుగుణంగా అధ్యయం చేసి చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల బిసి కమిషన్‌లను న్యాయస్థానం ఆదేశించింది. బిసి(-డి) కేటగిరీలో ఉన్న కులాలను బిసి(ఎ) లోకి మార్చిన వ్యవహరంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 2010లో దాఖలైన పిటిషన్లపై రెండు రాష్ట్రాల బీసీ కమిషన్లకు పలు సూచనలు జారీ చేసింది. 2009లో బిసి(-)డి కేటగిరీలో ఉన్న ముదిరాజ్‌లను బిసి(ఎ) లోకి మార్చుతూ అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై జాతీయ మత్య్సకారుల సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది.

అయితే విచారణ అనంతరం జీఓను కొట్టివేస్తూ హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును 2010లో ముదిరాజ్ సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ముదిరాజ్ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ పలు కులాల సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం అన్ని కులాల నిష్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఇరు బిసి కమిషన్‌లను ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. అలాగే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించింది. లాభనష్టాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News