న్యూఢిల్లీ: బలమైన కారణం ఉండడం వల్లే తాను ఐపిఎల్ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా స్పష్టం చేశాడు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. ఏ క్రికెటర్ కూడా బలమైన కారణంగా లేకుండా కోట్లాది రూపాయలను వదులుకోడనే విషయాన్ని విమర్శకులు గమనిస్తే బాగుంటుందన్నాడు. ఐపిఎల్ నుంచి అర్ధాంరతంగా తప్పుకోవడం వల్ల తనకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నాడు. తప్పనిసరి పరిస్థితుల వల్లే తాను కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నాడు. తన అత్యంత సమీపు బంధువులు దారుణంగా హత్యకు గురి కావడం ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. ఇక, ఐపిఎల్ నుంచి తాను తప్పుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని, దాన్ని ఇతరులకు వివరించాల్సిన అవసరం తనకు లేదని రైనా స్పష్టం చేశాడు. కాగా, సిఎస్కె యాజమాన్యంపై అలిగి రైనా అర్ధాంతరంగా ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడని జాతీయ మీడియాలో వార్త కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
Suresh Raina Response on pulls out of IPL 2020