Friday, April 26, 2024

సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Suspension action crime thriller movie

 

ఎస్. ఎస్. బ్రదర్స్ సమర్పణలో కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు హీరోహీరోయిన్లుగా సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘బిహైండ్ సమ్‌వన్’. ఈ చిత్రంతో అజయ్ నాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గోవాలో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ నాలి మాట్లాడుతూ.. “సరికొత్త పాయింట్‌తో నేను కథను రాసుకున్నాను. నా కథ విన్న వెంటనే.. సినిమాను నిర్మిస్తానని సునీల్ కుమార్ సింగ్ ముందుకు రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. ప్రేక్షకులను ఈ చిత్రం సరికొత్తగా థ్రిల్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను”అని అన్నారు.

నిర్మాత సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో యూత్‌కి కావాల్సిన అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కథ మీద ఉన్న నమ్మకంతో తెలుగు, హిందీ భాషలలో నిర్మించాం. తమిళం, మలయాళం, కన్నడ భాషలలోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News